భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆలూరు ప్రొహిబిషన్ సి.ఐ. లలితాదేవి కి ఉత్తమ అవార్డ్ లభించింది. సోమవారం కర్నూలు కలెక్టర్ డా. సిరి చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు.స్థానిక ఎక్సైజ్ స్టేషన్ అవరణములో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎస్సై నవీన్ జెండావిష్కరణ చేశారు.అనంతరం సి.ఐ. కి ఉత్తమ అవార్డ్ రావడంతో స్టేషన్ ఎస్సై సిబ్బంది అభినందనలు తెలిపారు.