📄 ePaper
Wednesday, March 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్హోళగుందలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

హోళగుందలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

📰 Generate e-Paper Clip

– బస్టాండ్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ
– మార్పు కోసం ఏర్పడిన శక్తి జనసేన అని నాయకుల వ్యాఖ్యలు
– పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు
– పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు

హోళగుంద, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక):

హోళగుంద మండల కేంద్రంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. మండల కన్వీనర్ అశోక్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మరియు రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో జనసేన పార్టీ ఏర్పడిందన్నారు. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, సామాన్య ప్రజలకు న్యాయం కల్పించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలకు కొత్త ఆశలు నింపిన నాయకుడిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలిచారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ సాధారణ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని నాయకులు తెలిపారు. ప్రజల అభ్యున్నతి కోసం పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.

జనసేన పార్టీ ఆశయాలు ప్రతి గ్రామానికి చేరేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్, యువ నాయకులు వెంకటేష్, చిన్న, రవి తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!